పౌరసత్వం (సమరణ) బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలతో తాను చర్చలు జరుపుతానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, ఇతర సీనియర్ రాజకీయ నాయకులు రాజ్నాథ్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ, పౌర సంఘాలతోనూ పౌరసత్వం బిల్లుపై సంప్రదింపులు జరుపుతానని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ చెప్పారని సంగ్మా అన్నారు. పౌరసత్వం (సవరణ) బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం విదితమే.