ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షలకుపైగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తీయించేశారని.. ఆ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వ్యవస్థలను ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో ఫిర్యాదు చేశామన్నారు. రకరకాల సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను రకరకాల సర్వేల ద్వారా తెలుసుకుని తొలగిస్తున్నారని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న జగన్.. ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో పంపిణీకి ఇప్పటికే నియోజకవర్గాలకు బాబు పంపిణీ చేశారని ఆరోపించారు.