ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 08:22 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని గమనించి.. ప్రయాణికులు ఇబ్బందిపడకుంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి ఈ స్పెషల్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.. మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వేశాఖ పొడిగించింది. అక్టోబర్‌ నుంచి నవంబర్, డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు కొనసాగున్నాయి. వరుసగా పండగలు ఉండటంతో రద్దీ భారీగా పెరుగుతుందని రైల్వేశాఖ అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.


కాచిగూడ- తిరుపతి (07653) ప్రత్యేక రైలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు.. తిరుపతి - కాచిగూడ (07654) అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు నడుస్తుందని అధికారులు తెలిపారు. తిరుపతి-అకోల, అకోల-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ రైళ్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం – తిరుపతి - మచిలీపట్నం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07122) అక్టోబర్ 7 నవంబర్ 4 వరకు.. సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07188) అక్టోబర్ 8 నవంబర్ 5 వరకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి.


కాచిగూడ – మధురై (07191), మధురై – కాచిగూడ (07192), సికింద్రాబాద్‌-రామనాథపురం (07695), రామనాథపురం-సికింద్రాబాద్‌ (07696), కాచిగూడ – నాగర్‌కోయిల్‌ (07435), నాగర్‌కోయిల్‌ – కాచిగూడ (07436), సికింద్రాబాద్‌ – కొల్లం (07193), కొల్లం – సికింద్రాబాద్‌ (07194) డిసెంబర్‌ వరకు పొడిగించారు. కాకినాడ టౌన్‌ – లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్‌, నర్సాపూర్‌-సికింద్రాబాద్, షాలిమార్‌ – సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – కొల్లం , కొల్లం – సికింద్రాబాద్‌, తిరుపతి- షిర్డీ సాయినగర్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.


మరోవైపు ప్రయాణికుల రద్దీ, వారి సౌకర్యార్థం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. సెప్టెంబరు 1 నుంచి 30 వరకు సంబల్‌పూర్‌-నాందేడ్‌ (20809) రైలు.. అలాగే సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 1 వరకు నాందేడ్‌-సంబల్‌పూర్‌(20810) రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు.


అలాగే సెప్టెంబరు 4 నుంచి 25 వరకు సంబల్‌పూర్‌-ఈరోడ్‌ (08311).. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఈరోడ్‌-సంబల్‌పూర్‌(08312) రైళ్లకు అదనంగా బోగీలు ఉంటాయి. ఈ రైళ్లకు ఒక థర్డ్‌ ఏసీ, ఒక స్లీపర్‌ బోగీ తాత్కాలికంగా జత చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ బోగీల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com