ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నరసరావుపేటలో పర్యటించనున్న సీఎం, డిప్యూటీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:35 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలంలోని కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ కశాళాల ప్రాంగణంలో 30న జరగనున్న వనమహోత్సవంలో చంద్రబాబు, పవన్‌ పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు ఉండవల్లి నుంచి హెలిక్యాప్టర్‌లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బయలుదేరుతారు. 10.30 గంటలకు జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. 10.45 గంటలకు వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటుతారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.45 గంటలకు బహిరంగ సభ ముగుస్తుంది. 12.50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకొని ఉండవల్లి బయలుదేరి వెళ్తారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ ఆరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ పర్యవేక్షించారు. బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com