ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థలవివాదంలో వ్యక్తికీ గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:25 PM

ఇంటి స్థలం వివాదంలో కన్న కూతురుపై నాన్న, పెద నాన్న దాడిచేసిన సంఘటనలో మధ్యలో గొడవ ఆపేందుకు వచ్చిన బంధువు కత్తి పోట్లకు బలయ్యాడు. కూతురు, అల్లుడు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా భీమడోలు శివారు అర్జావారి గూడెంలో జరిగిన ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది. భీమడోలు మండలం అర్జావారి గూడెంలో ఉండే తడపల వెంకటేశ్వరరావు, దుర్గారావు అన్న దమ్ములు. దుర్గారావు కుమార్తె పూజారాణికి ఆమె అమ్మమ్మ సుమారు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. పూజారాణి తన భర్త మోజేష్‌తో కలిసి అమ్మమ్మ ఇచ్చిన స్థలంలో తాతాల్కికంగా నిర్మించుకున్న షెడ్‌లో కాపురం ఉంటున్నారు. అయితే దుర్గారావు తన అమ్మ ఆస్తి తనకే చెల్లుతుందంటూ కూతురు ఉంటున్న స్థలం వెనక్కు ఇచ్చేయాలని ఆరు నెలలుగా గొడవ చేస్తున్నాడు. ఇటీవల ఈ వివాదంపై కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రి దుర్గారావును ఇది తప్పని హెచ్చరించారు. బుధవారం ఉదయం కూతురుపై గొడ్డలితో దాడి చేసేందుకు వెళ్లగా గొడవ ఆపేందుకు ఆమె మేనమామ చాబత్తుల కృష్ణ (50) మధ్యలోకి వెళ్ళగా దుర్గారావు అన్న వెంకటేశ్వరరావు వెనుక నుంచి వచ్చి కోత కత్తితో కృష్ణ మెడపై నరికాడు. అడ్డు వచ్చిన రాణి, భర్త మోజేష్‌లపై కూడా కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనలో కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. రాణి ఏలూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అల్లుడు మోజేష్‌ భుజంపై స్వల్ప గాయాలయ్యాయి. నింది తులు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భీమడోలు సీఐ రవి కుమార్‌తో పాటు క్లూస్‌ టీమ్‌ పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com