ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28న తిరుమలలో వాటికీ వేలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:45 PM

తిరుమల ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్తువులు వేలం వేయనున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28న వేలం వేయనున్నారు. వీటిల్లో ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు ఉన్నాయి. మొత్తం 6లాట్లు ఉండగా వాటిని ఆగస్టు 28న వేలం వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కాపర్-2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను ఆగస్టు 30, 31వ తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఆగస్టు 30న కాపర్- 2 రేకులు 3వేల కేజీలను 15లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. అలాగే ఆగస్టు 31న సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు 2,400 కేజీలను12లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు. టెండర్ లేదా వేలంలో పాల్గొనాలని అనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలి. దూరప్రాంతాల వారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com