ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో తెలుగు టెకీ కన్నుమూత.. భార్య, కొడుకు కళ్ల ముందే విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 09:08 PM

అమెరికాలో మరో తెలుగు టెకీ ప్రాణాలు కోల్పోయాడు. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని భార్య, కొడుకుతో బీచ్‌కు వెళితే.. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు ఎంసీఏ పూర్తి చేశారు. 20 నెలల క్రితం ఆయనకు అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. అయితే ఆరు నెలల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌ అద్వైత్‌‌లు కూడా అమెరికాకు వెళ్లారు. బుచ్చిబాబు భార్య, కుమారుడితో కలిసి శనివారం కాలిఫోర్నియాలోని బీచ్‌కి వెళ్లారు.


ముగ్గురు కలిసి కొద్దిసేపు సరదాగా సముద్రంలో స్నానం చేశారు.. సెల్ఫీలు దిగారు. ముగ్గురూ ఒడ్డుకు వచ్చిన తర్వాత బుచ్చిబాబు మళ్లీ ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరులోని బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియడంతో.. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి.. బుచ్చిబాబు తండ్రి కోటేశ్వరరావును ఫోన్‌లో పరామర్శించారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్‌, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతో మాట్లాడి త్వరగా మృతదేహాన్ని ముండ్లమూరుకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు లక్ష్మి.


క్రికెటర్లకు టీడీపీ ఎంపీ ప్రోత్సాహం


ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 31 క్రికెట్‌ టీంలకు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు. గత నెలలో ఒంగోలులో జరిగిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ లీగ్‌ పోటీలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 31 టీంలు పాల్గొన్నాయి. పాల్గొన్న 31 టీంలకు క్రికెట్‌ కిట్లను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరున స్థానిక టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి క్రీడాకారులు అభినందనలు తెలిపారు. క్రికెటర్లు మాగుంట శ్రీనివాసులరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. రాబోయే రోజుల్లో ఆటగాళ్లకు ఇలాంటి ప్రోత్సహం కచ్చితంగా అందిస్తామన్నారు టీడీపీ నేతలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com