ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్‌ విగ్రహం దాడిపై సమగ్ర నివేదిక ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 10:10 AM

విజయవాడలోని అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌–ఏటీఆర్‌) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కిషోర్‌ మక్వానాను కలిసిన వైయస్సార్‌సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com