అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణం దర్యాప్తులో పురోగతి కనిపిస్తుంది. ఈడీ ఈ కేసులో నిందితులైన కార్పొరేట్ లాబీయిస్ట్ రాజీవ్ సక్సేనా, దీపక్ తల్వార్ లను అరెస్ట్ చేసింది. రాజీవ్ సక్సేనా, తల్వార్ లను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఎనిమిది రోజుల రిమాండ్ కోరింది. రాజీవ్ సక్సేనా దుబాయ్లో వ్యాపారవేత్త, తల్వార్ కార్పొరేట్ ఏవియేషన్ లాబీయిస్ట్, వీరిద్దరినీ దుబాయ్ అధికారులు నిర్బంధించారు. వీరిపై మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.రిని దుబాయ్ నుంచి భారతదేశానికి రప్పించిన ఈడీ రిమాండ్ కోరింది. కోర్టులో ఇంకా వాదనలు పూర్తికాలేదు కానీ రిమాండ్ కి అప్పగించే అవకాశాలే ఉన్నాయి.