పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా ముందు వరుసలో కూర్చున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేల మధ్యలో రాహుల్ ఆసీనులయ్యారు. రాహుల్ గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంకా గోవాలోనే ఉన్నారు. సోనియా రేపు ఢిల్లికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.