ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 11:13 PM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుంది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికి రైతు భరోసా అందేది’’ అని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల జిల్లా సీతారామాపురంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com