ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనికి ఎందుకు సెక్యూరిటీ పెంచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:22 PM

వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు సెక్యూరిటీ ఎందుకు పెంచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంగా ఉన్న చంద్రబాబుకు మించి సెక్యూరిటీ అడుగుతున్నారంటే, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి ఇంటర్నేషనల్‌ త్రెట్‌ ఏమైనా ఉందా అనేది చెప్పాలన్నారు. సెక్యూరిటీ పెంచాలంటే అసెంబ్లీకి వచ్చి అక్కడ కారణాలు చెప్పి సెక్యూరిటీ పెంచమని అడిగితే మీ కోసం మేమంతా వెళ్లి చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లకు విజ్ఞప్తి చేసి వేడుకుంటాం అన్నారు. అసెంబ్లీకి రాకుండా రాష్ట్రంలో అల్లరిచిల్లరిగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నాకు భద్రత లేదని చెప్పడం సరికాదన్నారు. ముందుగా సీఎం అనే ఫోబియా నుంచి జగన్‌ బయటకు రావాలని కోరుతున్నామన్నారు. నామినేటెడ్‌ పదవుల విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్‌ పదవుల విషయంలో ఎమ్మెల్యేపాత్ర కూడా నిమిత్త మాత్రమే అన్నారు. హై కమాండ్‌ సుప్రీం, వాళ్లు అన్ని కోణాల్లో చూసి అర్హులను ఎంపిక చేస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com