ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ భూములు పేదలకి దక్కాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:21 PM

అట్లూరు మండలంలోని నల్లాయపల్లెలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలంటూ అట్లూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట బుదవారం వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన  కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు కంచె వేసి అందులో పండ్ల మొక్కలు నాటారని, వెంటనే ఆ కంచెలు తొలగించి భూమిలేని పేదలకు పంచాలంటూ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమణయ్య వెల్లడించారు. నల్లాయపల్లె ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. అనంత రం అట్లూరు తహసీల్దారు రవిశంకర్‌కు వినతిపత్రం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com