ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:11 PM

జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జన్మభూమి కార్యక్రమంపై టీడీపీ పొలిబ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించినట్లు తెలిపారు. వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు నిండటంతో జగన్ గుండె నీరుకారుతోందని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత చంద్రబాబు మరోసారి హెచ్చరించారన్నారు. జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశం 160 మాత్రమే ఉంటాయన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com