'మక్కల్ నీది మయ్యమ్' (ఎంఎన్ఎం) పార్టీ విభాగాన్ని బుధవారం పుదుచ్చేరిలో ప్రముఖ నటుడు కమల్హాసన్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎన్ఎం పార్టీని స్థాపించి ఏడాది పూర్తైందని, ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మరో విభాగాన్ని ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగిస్తోందని కమల్ వ్యాఖ్యానించారు. కాగా, ఎంఎన్ఎం పార్టీని గతేడాది ఫిబ్రవరి 21న ఆయన స్వస్థలమైన రామేశ్వరమ్లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటన చేపట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తమ సిద్ధాంతాలతో ఏకీభవించిన ఇతర పార్టీలను కలుపుకుపోతామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.