ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదుచ్చేరిలో పార్టీని ఏర్పాటు చేయనున్న కమల్‌హాసన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 11:56 AM

 'మక్కల్‌ నీది మయ్యమ్‌' (ఎంఎన్‌ఎం) పార్టీ విభాగాన్ని బుధవారం పుదుచ్చేరిలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించి ఏడాది పూర్తైందని, ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మరో విభాగాన్ని ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగిస్తోందని కమల్‌ వ్యాఖ్యానించారు. కాగా, ఎంఎన్‌ఎం పార్టీని గతేడాది ఫిబ్రవరి 21న ఆయన స్వస్థలమైన రామేశ్వరమ్‌లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటన చేపట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తమ సిద్ధాంతాలతో ఏకీభవించిన ఇతర పార్టీలను కలుపుకుపోతామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com