ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం స్వామివారిని దర్శించుకున్న రాజాసింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:04 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లను బుధవారం తెలంగాణ రాష్ట్రం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామికి అభిషేకం, భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకు మార్చనలు జరిపించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యేకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com