ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా తప్పు లేకున్నా, నన్ను సస్పెండ్ చేసారు, నాకు న్యాయం చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:03 PM

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలి చిరుద్యోగిపై విద్యుత్‌శాఖ అధికారులు వేటు వేశారు. పెద్ద దోర్నాల మండలంలోని చిన్నగుడిపాడు సచివాలయం జేఎల్‌ఎంగా దూదేకుల మస్తాన్‌వలి విధులు నిర్వహిస్తు న్నాడు. ఈ నెల 20వ తేదీన చిన్నగుడిపాడు గ్రామ పొలాల్లో మేతకు వెళ్లిన రెండు పాడి గేదెలు నేలకు దగ్గరగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలు తాకి ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఈ ఘటనపై విద్యుత్తు శాఖ ఉన్నతాధి కారులు చేపట్టిన చర్యల్లో భాగంగా సచివా లయం జేఎల్‌ఎం గ్రేడ్‌ -2 ఉద్యోగి మస్తాన్‌వలిని అందుకు బాధ్యుడిని చేశారు. ఈ నెల 22న ఉద్యోగ బాధ్యతల నుండి రిలీవ్‌ చేశారు. అయితే దీనిపై మస్తాన్‌వలి స్పందిస్తూ.., ఘటనకు తనను అన్యాయంగా బాధితుడిని చేశారన్నారు. అసలు 11కేవి లైను పర్వవేక్షణ తన పరిధిలోనిది కాదన్నారు. అయినా ఈ నెల 7న ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకు దగ్గరగా ఉందని ఏ ప్రమాదమైనా జరిగే అవకాశముందని అబ్జర్వేషన్‌ లిస్టులో నమోదు చేశాన్నారు. లైన్‌మెన్‌ నాయక్‌కు కూడా విషయం తెలియజేసినట్లు తెలిపారు. తీరా గేదెలు మృతిచెందితే తనను బాధ్యున్ని ఎలా చేస్తారని ఆయన ఆందోళన వెలిబుచ్చాడు. ఆ ఘటనలో లైన్‌మెన్‌, ఏఈల పొరబాటు ఉంటే ఉన్నతాధికారి డీఈ తనను బాధ్యుడిని చేశారన్నారు. లైన్‌మెన్‌, డీఈలు ఉద్దేశ్య పూర్వకంగా తనను రిలీవ్‌ చేశారని ఆరోపించాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని మస్తాన్‌ వలి కోరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com