ప్రతీ కౌలు రైతుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ సూచించారు. బుధవారం నరసన్నపేట స్థానిక వెలుగు కార్యాలయంలో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10 వేల వరకు కౌలు రైతులున్నారని, వారికి ఎకరాకు కనీసం రూ.20 వేలు రుణం ఇవ్వాలన్నారు. గతేడాది కేవలం రూ.10 కోట్లు మాత్రమే కౌలు రైతులకు రుణాలివ్వడం జరిగిందని. ఈఏడాది కనీసం రూ.50 కోట్ల వరకు ఇవ్వాలన్నారు. గతేడాది చేపట్టిన సమగ్ర భూసర్వేతో 1బీ పత్రాలు రావడంలేదనే ఈ విషయాన్ని బ్యాంకర్ల గుర్తించి రైతుల భూహక్కు పత్రాల ఆధారంగా రుణాలను రెన్యూవల్ చేయాలని కోరారు. స్వయంశక్తి సంఘాలకు గ్రూపు రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు కూడా ఇవ్వాలన్నారు. కార్యాక్రమంలో యూనియన్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ సెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, నారాయణరావు, ఏసీ కొండలరావు, ఏపీఎంలు సాయిలక్ష్మి, గోవిందరావు, రాజారావు, డీసీసీబీ, యూనియన్ బ్యాంకు, ఎస్వీజీబీ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.