ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సచివాలయ శిలాఫలకాన్ని పగులగొట్టిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 12:55 PM

ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివా­లయ భవనం శిలాఫల­కాన్ని  కార్యకర్తలు  సోమవారం రాత్రి ధ్వంసం చేసారు అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్‌ల ఫొటోలను ఏర్పాటు చేశారు. పచ్చ­మూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్‌ జగన్, మేకా ప్రతాప్‌ ఫొటోలను పగుల­గొట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివా­లయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com