ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.. బ్లాక్‌లో పెట్టిన ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:00 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో నాణ్యతపై గతంలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జే శ్యామలరావు తిరుమలలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలని.. తయారీకి వినియోగించే పదార్థాలు కూడా అత్యంత నాణ్యతగా ఉండాలని సూచించారు. లడ్డూ తయారీకీ ఉపయోగించే పదార్థాల నాణ్యతను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు.


  తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి.. టీటీడీ ఈవో శ్యామలరావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు పాటించని ఓ కాంట్రాక్టర్‌పై వేటు పడింది. ఈ మేరకు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. లడ్డూల్లో నాణ్యత, సువాసన తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా నెయ్యిలో నాణ్యత లేకపోవడమేనని గుర్తించినట్లు శ్యామలరావు ఇటీవల తెలిపారు. సోమవారం నెయ్యి సేకరణ నిపుణుల కమిటీతో సమీక్ష నిర్వహించారు ఈవో.


టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు కాంట్రాక్టర్లలో.. ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని తేలిందన్నారు. కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్టు పరీక్షల్లో తేలిందని.. టెండర్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచేందుకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. టీటీడీ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ అని తెలుస్తోంది. ఈ సంస్థ 8.50 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండరు దక్షించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటివరకు 68వేల కేజీల నెయ్యి సరఫరా చేయగా.. ఇందులో 20 వేల కిలోల నెయ్యి నాణ్యత బాగాలేదని తిరస్కరించినట్టు తెలుస్తోంది.


శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు


తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 31 నుండి ఆగ‌స్టు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 30న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారంజాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.


పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com