జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వికసిత భారత్ - 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దామని సూచించారు. సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు అని తెలిపారు. పంట కాల్వల్లోకి వ్యర్థాలు విడిచిపెడుతున్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.