ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంత్రి నారాయణ నివాసంలో ఎమ్మెల్యేలతో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు(శనివారం) భేటీ అయ్యారు. జిల్లాలో సమస్యలు, అభివృద్ధిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపరిష్కృత సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించి కలసి కట్టుగా పని చేస్తామని అన్నారు. పార్టీ బలోపేతానికి, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఐక్యతతో కలసి కట్టుగా పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.