గ్రామాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. శుక్రవారం మెరకముడిదాం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్, పారిశుధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశిం చారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ సమస్య అయినా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింపజేయాలన్నారు. ఈ కార్యక్రమం లో నేతలు కిమిడి రాంమల్లిక్నాయుడు, సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.