తాడిపత్రి పట్టణంలోని మెయినబజారులో ఉన్న బంగారు దుకాణాలపై శుక్రవారం విజయవాడకు చెంది న బ్యూరో ఆఫ్ ఇండియన స్టాండర్డ్ జాయింట్ డైరెక్టర్ రమాకాంతసాగర్, డిప్యూటీ డైరెక్టర్ సాయికౌషిక్ రెండు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బంగారు నాణ్యతను పరీక్షించే మిషన్లను తనిఖీ చేశారు. సుదర్శన హాల్మార్కింగ్ జ్యువెల్లర్స్, శిరిపురి హాల్మార్కింగ్ జ్యువెల్లర్స్ లో జరిగిన అవకతవకలను గుర్తించారు. 22క్యారెట్లు ఉన్న బంగారం ఈ షాపుల్లో 12 నుంచి 13క్యారెట్ల వరకు చూపిం ది. దీంతో మోసం జరిగినట్లు వారు గుర్తించి నాణ్యతను చూపించే మిషన్లను సీజ్ చేశారు. ఈ షాపుల్లో అవకతవక లు జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, అందువల్ల దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. శనివారం కూడా దాడులు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడుల్లో డిప్యూటీ డైరెక్టర్ అఖిల్ స్థానిక పోలీసులు పాల్గొన్నారు.