డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెల్ల గ్రామంలో అరుంధతీపేట వద్ద రోడ్డుపక్కన 9 ఏళ్ల కిందట సిమెంటు దిమ్మపై బాబూజగజ్జీవన్రామ్, అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కిందపడేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయ సిబ్బంది విగ్ర హం ధ్వంసంకావడం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐ పి.దొరరాజు, ఎస్ఐ సురేంద్రబాబు పోలీసు సిబ్బం ది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ను రప్పించారు. క్లూస్టీం సభ్యులు వేలిముద్రలు, ఆధారాలు సేకరించా రు. డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. ద్రాక్షారామ ఎస్ఐ సురేంద్రబాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు అసాం ఘిక శక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. సమా చారం తెలిసిన వెంటనే క్లూస్టీం, డాగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగా యని, దోషులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా సమాచారం తెలిసిన వెంటనే నియోజకవర్గానికి చెందిన దళిత, ప్రజా సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసంచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ అంబ టి భవానీ, జనసేన నాయకుడు బుంగరాజు, టీడీపీ నాయకుడు రవ్వాభూషణం, వైసీపీ నాయకులు అంబటి తుకారాం, పోలినాటి ప్రసాద్, రైతుకూలీ సంఘం నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ నాయకుడు బి.సిద్దూ డిమాండు చేశారు.