ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజానిజాలు ఏమిటో ఫైల్స్‌ చూసి తెలుసుకొని మాట్లాడు పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 11:45 AM

2010 నుంచి 2020 మధ్య కాలంలో ఎర్ర చందనం చైనాకు వయా నేపాల్‌ నుంచి అక్రమంగా రవాణా జరుగుతుందని, ఇందులో భాగంగా 173 టన్నుల ఎర్ర చందనం పట్టుకున్నామని నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించిందని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చెప్పారు. అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళుతున్న ఎర్ర చందనం దుంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నట్లు నేపాల్‌ మంత్రి గోకుల్‌ ప్రసాద్‌ బస్కోట ప్రకటన చేసిన విషయం, దానికి సంబంధించిన పత్రికా కథనాలు ఆయన మీడియాకు చూపారు. పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించినట్లు ఎర్రచందనం దుంగలు దొరికింది 2020 జనవరిలో అంటే జగన్‌ గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అని నాగార్జున అన్నారు. అంతకుముందు పదేళ్ళుగా జరిగిన క్రమంలో ఆ దుంగలు దొరికాయని నేపాల్‌ ప్రభుత్వం స్పష్టం చేసిందని, కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్  ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్‌ రెడ్డిగారే అక్రమ రవాణా చేస్తూ దొరికినట్లు అసత్య ప్రచారం, అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ నేపాల్‌ ప్రభుత్వం దుంగలపై మన కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాత వైయ‌స్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రానికి లేఖ రాసిన విషయం గుర్తుచేశారు. ఒక్క నేపాల్‌లోనే కాదు, దుబాయ్, శ్రీలంక, మలేషియా, పక్క రాష్ట్రాలు తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలలో కూడా ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం ఉంది, కావున దయచేసి సుమారుగా 8 వేల టన్నుల ఎర్ర చందనం అక్రమంగా రవాణా జరిగింది, ఇదంతా వివిధ రాష్ట్రాలలో, దేశాల్లో ఉంది కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీనిపై దృష్టిపెట్టి ఈ 8 వేల టన్నులు ఏపీకి రావాలని, దీని ద్వారా సుమారు నాలుగైదు వేల కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఏపీకి రావాలని వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం లేఖలు రాసిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన శాఖలపై దృష్టిపెట్టాలని, అటవీ శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉందని, ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన మంత్రిత్వ శాఖలలోనే ఉన్నాయన్నారు. ఫైల్స్‌ చదువుకోవచ్చని, ఈ లేఖలు మీరు పట్టించుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా పవన్‌కళ్యాణ్‌ నైతికతకు భంగం వాటిల్లుతుందనే విషయాన్ని గుర్తించాలని నాగార్జున అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com