ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరికి మిర్చి వ్యాపారి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:53 PM

కిడ్నాప్‌కు గురైన మిర్చి వ్యాపారి వ్యవహారంపై ఇంచుమించు 30 గంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు చివరకు తెరపడినట్లైంది. అపహరణకు గురైన వెంకటరెడ్డిని గురువారం రాత్రి 7.00 గంటల సమయంలో గొట్టిపడియ గ్రామ సమీపంలోని కొండపై రైతులు వదిలి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లిన పోలీసులు వాహనంలో వెంకటరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు.మార్కాపురం మండలంలోని బిరుదులనరవ గ్రామంలోని దానిమ్మ పొలం వద్దకు బుధవారం మధ్నాహ్న సమయంలో మిర్చి వ్యాపారి రాగి వెంకటరెడ్డి అత్తమామలతో కలిసి వెళ్లాడు. పొలం వద్ద ఉన్న విషయం తెలుసుకున్న గొట్టిపడియకు చెందిన బాధిత రైతులు అక్కడకు వెళ్లారు. తొలుత వెంకటరెడ్డి కారును ధ్వంసం చేశారు. అనంతరం మోటార్‌ సైకిళ్లపై వెంకటరెడ్డిని అక్కడ నుంచి సుమారు 8 మంది రైతులు అపహరించుకు పోయారు. సాయంత్రం సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగినా రాత్రి సమయం కావడంతో వెతుకులా డేందుకు అవరోధం ఏర్పడింది. కొంత మంది సిబ్బందితో గొట్టిపడియ, బిరుదుల నరవ గ్రామ పరిసరాల్లో పోలీసు సిబ్బంది గాలించారు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉదయాన్నే అదనపు ఎస్పీ కె.నాగేశ్వర రావును ఏఆర్‌ సిబ్బందితో కలిపి మార్కాపురం పంపారు. అంతేకాక మార్కాపురంతో పాటు ఎర్రగొండ పాలెం, త్రిపురాంతకం, కంభం, గిద్దలూరు సీఐలను కూడా రంగంలోకి దింపారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసు అధికారులు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వ్యాపారిని కిడ్పాప్‌కు చేసిన రైతుల బంధువుల ద్వారా ఒత్తిడిని తీవ్రం చేయడంతో వ్యాపారిని అపహరించిన రైతులు గురువారం రాత్రి 7.00 గంటల సమయంలో వెంకటరెడ్డిని గొట్టిపడియ కొండపైకి తీసుకెళ్లి ఒక రైతు ఫోన్‌ నుంచి పోలీసులకు ఫలానా చోట ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకుని పోలీసులు వెంకట రెడ్డిని మార్కాపురం తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com