ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోటు బడ్జెట్ లో జల వనరుల శాఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:48 PM

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గడచిన రెండు, మూడేళ్లలో జల వనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి రూ. 389.12 కోట్ల బకాయిలు ఉన్నట్టు నార్త్‌ కోస్టల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.సుగుణాకరరావు పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రూ.121.12 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్‌ చేశామన్నారు. మరో రూ.29.09 కోట్ల బిల్లులు సిద్ధం చేశామన్నారు. ఇంకా రూ.238.89 కోట్ల విలువైన పనులు పూర్తికాగా వాటి వివరాలు ఎంబుక్‌లో నమోదుచేయాల్సి ఉందన్నారు. ఉత్తరాంధ్రలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు 18 ఉన్నాయని, వీటిలో వంశధార ప్రాజెక్ట్సు నిర్వహణ, అత్యవసర పనులు చేపట్టిందుకు రూ.25 కోట్లు, తారకరామా ప్రాజెక్టుకు రూ.20 కోట్లు, మూడు జిల్లాల్లో జపాన్‌ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.35 కోట్లు బిల్లులు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇంకా మహేంద్రతనయా ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు కోసం రూ.35 కోట్లతో పనులు పూర్తిచేయగా, వాటిలో రూ.20.34 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేశామన్నారు. నదుల వరద కట్టల మరమ్మతుల కోసం రూ.51 కోట్లు వెచ్చించగా రూ.17 కోట్లు, తాటిపూడి ప్రాజెక్టు కింద రూ.17.6 కోట్ల పనులకు బిల్లులు అప్‌లోడ్‌ చేశామని వివరించారు. ఇటీవల జల వనరుల శాఖా మంత్రి సమీక్షలో బకాయిల వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బిల్లులపై నివేదిక రూపొందించి అందజేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com