ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితులకు జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 12:30 PM

విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో అదే గ్రామానికి చెందిన నిందితులు రాగితి సత్తయ్యకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2500 జరిమానా, వాసుపల్లి కన్నయ్యకు ఏడాది జైలు, 500 రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి బుధవారం తీర్పు వెలువరించినట్లు దిశా పోలీస్‌ స్టేషన్‌ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. సత్తయ్య, కన్నయ్య 2021 ఆగస్టు 26న మైనర్‌ బాలికను అపహరించి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు దిశా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై కేటీఆర్‌ లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. నిందితులపై నేరారోపణ రుజువు కావటంతో ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com