ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిమ్స్‌ కి అండగా ఉంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 01:37 PM

ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్‌ - 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధబానందకర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎయిమ్స్‌ ఎదర్కొంటున్న సమస్యలను వివరించారు. నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని వివరించారు. సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన పైప్‌లైన్‌ పనులు ఆగిపోయాయని తెలిపారు. రోజుకు 7 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉండగా, ట్యాంకర్ల ద్వారా 2 ఎంఎల్‌డీ నీరు మాత్రమే అందుబాటులో ఉంటోందని చెప్పారు. విద్యుత్‌ సరఫరా విషయంలో కూడా సమస్యలు ఉన్నట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 192 ఎకరాలకు గాను 182 ఎకరాలు ఇచ్చారని, మరో 10 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్‌ విస్తరణ పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఎయిమ్స్‌లో అందుతున్న సదుపాయాలపై ఒకసారి వచ్చి పరిశీలించాలని సీఎంను ఆహ్వానించారు. త్వరలో పూర్తిస్థాయి సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎయిమ్స్‌కు తాగునీటి సరఫరా చేసే పనులు నిలిచిపోవడం సరికాదని, సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com