ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవుల దొంగతనం, నిందితుడికి జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:33 PM

రెండు ఆవులను తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన నిందితుడికి చిత్తూరు న్యాయస్థానం ఆరునెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. బంగారుపాళ్యం దళితవాడకు చెందిన మురళి తనకున్న రెండు ఆవులను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ క్రమంలో 2020 జూలై 26న ఈ ఆవులను బంగారుపాళ్యం మండలం ముత్తుబంగారునగర్‌ కాలనీలోని శైలేష్‌ తీసుకెళ్లి అమ్మేశాడు. బంగారుపాళ్యం పోలీసులు శైలే్‌షపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు సోమవారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వాయిదా ఉండగా, ళశైలే్‌షపై నేరం రుజువుకావడంతో అతడికి ఆరునెలల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ కృష్ణారెడ్డి వాదించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com