ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనగాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 03:52 PM

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి భారీ మెజార్టీతో గెలుపొందటంతో ఆదివారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్థి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆయన వెంట సోదరుడు శివప్రసాద్‌, టీడీపీ నాయకులు దండుప్రోలు పిచ్చియ్య, మరికొందరు టీడీపీ నాయకులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com