ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని నిర్మాణం మా ప్రధాన లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 03:51 PM

పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, కేంద్రంలో టీడీపీకి లభించిన ప్రాధాన్యత, గన్నవరంలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితరాలపై ఆయన స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com