తాడేపల్లిలోని వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ కీలక నేతలు కలిశారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైయస్ జగన్తో పార్టీ నేతలు చర్చించారు. వైయస్ జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, ఎంపీ గురుమూర్తి, శివప్రసాద్రెడ్డి, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.