ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 27, 2024, 05:37 PM

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడం ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com