ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిన్నెల్లి పగలగొట్టిన ఈవీఎంలో వైసీపీకి పోలైన ఓట్లు ఎన్నంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 10:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేశారనే ఆరోపణలు రావటం, ఓ వీడియో వైరల్ కావటం అందరికీ తెలిసిందే. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించగా.. పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. జూన్ ఆరో తేదీ వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు గురువారం ఆదేశించింది.


అయితే పాల్వాయి గేట్ వద్దనున్న పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యిందీ టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పోలైనట్లు వర్ల రామయ్య తెలిపారు. ఈవీఎం బాక్సులో నుంచి కిందపడిన ఓటర్ స్లిప్పుల ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారేమోనంటూ విమర్శలు గుప్పించారు. మాచర్లలో మార్పు మొదలైందన్న వర్ల రామయ్య.. ప్రజల్లో వస్తున్న మార్పును చూసే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు.


మాచర్లకు వెళ్లొద్దు.. పిన్నెల్లికి హైకోర్టు ఆంక్షలు


మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసిన ఏపీ హైకోర్టు..ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశించింది. అలాగే నరసరావుపేట కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అలాగే జూన్ 6 వరకు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని చెప్పింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com