కాకినాడ మండలం తూరంగికి చెందిన అనపర్తి శ్రీను (25) కొవ్వూరు లాకుల వద్ద స్నానానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో మృతి చెందినట్టు ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి కొవ్వూరు లాకుల వద్దకు బుధవారం వెళ్లారు. వారంతా నీటిలో దిగిన తరువాత అనుకోకుండా శ్రీను మృతి చెందగా మిగిలినవారంగా క్షేమంగా ఉన్నారు. మృతుడి నానమ్మ ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృ తదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.