గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పూర్తిస్థాయి సమాచారం, సాంకేతిక సహకారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు చేసేందుకు, ఓటర్లకు ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్లు, పోర్టల్, వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్లను వినియోగించుకొనేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. తప్పు చేసిన వారికి క్షణాల్లో శిక్ష అమలయ్యేలా యాప్లను ఈసీ రూపొందించింది.