ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 04:42 PM

చంద్రగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని, వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి ఇద్దరూ కూడా ఏకకాలంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అభ్యర్థులతో పాటు భారీగా కార్యకర్తలు ఆర్డీవో ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే వీరిని లోపలికి అనుమతించేందుకు పోలీసుల నిరాకరించారు. అలాగే రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు. అయితే మరోసారి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు రౌడీ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ప్రతిగా ఆర్డీవో కార్యాలయం వద్దకూ టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com