ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో అలాంటి వారికే ఓటు వేయండి.. వెంకయ్య నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 07:56 PM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నికలు, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్యను ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా.. అందుకే రాలేదని.. ఇకపై ప్రజలతో ఉంటానన్నారు.


ఇటీవల కాలంలో నేతలు పార్టీలు మారడం ట్రెండ్‌గా మారిందని.. ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అని కామెంట్ చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చని.. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. యాంటీ డిఫెక్షన్ లాను బలోపేతం చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయపార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని.. చెట్లకు డబ్బులు కాయవని గమనిస్తే మంచిదన్నారు. తాను ఉచితాలకు వ్యతిరేకమని.. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని.. ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలన్నారు. అన్ని రాజకీయపార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజలు కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.. అలాగే ఓటర్లు తమ ఓటర్ స్లిప్ సరి చూసుకోవాలని.. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయాలన్నారు. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో తప్పకుండా పాల్గొనాలని కోరారు.


ప్రజా సమస్యలను, ఇతర అంశాలను తాను ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లనని తేల్చి చెప్పారు.వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని.. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ప్రజా జీవితంలో ప్రతిఒక్కరు యాక్టివ్ గా ఉండాలని.. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని చెప్పుకొచ్చారు. పార్టీకి తానిచ్చే స్థానం తన జీవితంలో మారదన్నారు. ఆర్టికల్ 370 రద్దు తాను రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశంగా అభివర్ణించారు.


లోక్‌సభలో మెజారిటీ ఉన్నా మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టారని.. సభను వాయిదా వేయకుండా నడిపించానని గుర్తు చేశారు. శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందింది అన్నారు. రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సరిగా జరిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు. దేశం రోజు రోజుకు ముందుకు వెళ్తుందని.. ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. శత్రు దేశాలు భారత్‌ను చూసి ఓర్చుకోలేక పోతున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com