ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే రెండో పవర్ ఫుల్ నేత.. కానీ సొంత కారు కూడా లేదు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 10:00 PM

గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, కేసుల గురించి వివరాలను అమిత్ షా వెల్లడించారు. తన పేరున రూ.36 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు. అయితే, ఆయన పేరుతో సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. రూ.20 కోట్ల విలువైన చరాస్తులు.. రూ.16 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. అలాగే, రూ.72 లక్షల విలువైన బంగారం, వెండి తనకు ఉందని, తన భార్య వద్ద ఉన్న రూ.1.10 కోట్ల విలువైన నగలు ఉన్నాయని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అప్పుల విషయానికి వస్తే తనకు రూ.15 లక్షల రుణం ఉందని వివరించారు. 2022-23లోవార్షిక ఆదాయం రూ.75.09 లక్షలని అఫిడ్‌విట్‌లో పొందుపరిచారు.


అమిత్ షా సతీమణి సోనాల్ షా ఆస్తుల విలువ రూ.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ.22.46 కోట్ల విలువైన చరాస్తులు, రూ.9 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట రూ.26.32 లక్షల రుణాలు ఉండగా... ఆమె వార్షిక ఆదాయం రూ.39.54 లక్షలుగా వెల్లడించారు. ప్రధానంగా తనకు ఎంపీ హోదాలో లభించే వేతనం, ఇల్లు, భూమి అద్దె, వ్యవసాయంతో పాటు షేర్లు, డివిడెండ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయ వనరులని వివరించారు. అఫిడ్‌విట్‌ పత్రాల్లోని వృత్తి (ఆక్యుపేషన్) కాలమ్‌లో రైతు, సామాజిక కార్యకర్త అని చెప్పుకున్నారు. తనపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్టు చెప్పారు. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమిత్ షా గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. గాంధీనగర్ నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com