రేపల్లె రూరల్ మండలం కామరాజు గడ్డ నార్త్ కు చెందిన వాలంటీర్లు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాలంటీర్లు మోతుకూరి నాగ ఝాన్సీ లక్ష్మి, అల్లూరి సుకన్యలకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాతా ఏడుకొండలు తదితరులు ఉన్నారు.