ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు అధ్యక్షతన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా బలపరిచిన ఎంపి అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి నారాయణ రెడ్డి ని గెలిపించాలన్నారు.