ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం, దేవగుప్తం కర్రి చెరువుకు చెందిన చిత్రపు ఆంజనేయులు (41) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మానసిక ఆందోళనతో జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి సమీపంలోని తోటలో కొబ్బరి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని అమలాపురంలోని ఓ ప్రైవేటుకు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భార్య కువైట్లో ఉపాధి పొం దుతోంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్టుఎస్ఐ తెలిపారు.