ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీలు, ఫ్యాన్లు కొనేవారికి బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. రేపటి నుంచే షురూ

business |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 07:18 PM

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ వేసవిలో ప్రత్యేక ఆఫర్లతో సమ్మర్ సేల్ తీసుకొస్తోంది. ఈ యాన్యువల్ సేల్ ద్వారా ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17, 2024 తేదీన ప్రారంభమవుతోంది. ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఈ ప్రత్యేక డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వంటి కూలింగ్ హోమ్ అప్లయన్సెస్ పై ఆఫర్లు అందుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ స్పెషల్ సేల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సూపర్ కూలింగ్ డేస్ 2024 పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సేల్ లో వివిధ కంపెనీలు, బ్రాండ్లకు చెందిన పలు రకాల హోమ్ అప్లయన్సెస్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ రోజుల్లో రూ. 1,299 నుంచి ధరలు ప్రారంభమవుతాయని పేర్కొంది. క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్, న్యూ కస్టమర్, ట్యాప్ అండ్ విన్ సూపర్ కాయిన్స్ వంటి వివిధ రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ వంటి ఆప్షన్లు సైతం ఇస్తున్నామని పేర్కొంది.


మరోవైపు.. వస్తువుల గురించి తెలుసుకునేందుకు వ్యూ ఇన్ 360, ఫైర్ డ్రాప్స్ గేమిఫికేషన్ , 3 డీ వ్యూయింగ్, వీడియో అసిస్టెన్స్ వంటి ఆప్షన్లు ప్రీమియం కస్టమర్లకు అందిస్తున్నామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అలాగే ఫ్లిప్ కార్ట్ జీవ్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఇన్‌స్టాలేషన్ సర్వీస్ అందిస్తామని తెలిపింది. వర్ల్ పూల్, హయర్, గోద్రేజ్, శామ్ సంగ్, ఐఎఫ్‌బీ బ్రాండ్లలో వివిధ రకాల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటి ధరలు రూ. 9,990 నుంచి ప్రారంభమై రూ. 2 లక్షల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఏసీల విషయానికి వస్తే.. ఎల్‌జీ, వోల్టాస్, గోద్రేజ్, డైకిన్, పానాసోనిక్, బ్లూస్టార్ బ్రాండ్లు ఉన్నాయని వాటి ధరల శ్రేణి రూ.25 వేల నుంచి రూ. 65 వేల మధ్య ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు.. సీలింగ్ ఫ్యాన్ల ధరలు రూ. 1,299 నుంచి రూ. 15 వేల వరకు ఉన్నట్లు తెలిపింది. ఎక్స్చేజీ రాయితీలు సైతం అందిస్తున్నామని పేర్కొంది. రిఫ్రిజిరేటర్లు ఎక్స్చేంజీ చేస్తే రూ.22 వేల వరకు, ఏసీలు అయితే రూ.8 వేల వరకు రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com