ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి రాత్రి నుంచి 2 నెలల పాటు వేటకు విరామం.. ఒడ్డుకు చేరుకున్న పడవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 04:29 PM

సముద్రంలో చేపలు, రొయ్యలే మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం. వీటి సంపద లభించాలంటే ఉత్పత్తి పెరగాలి. తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మత్స్యసంపద సంతానోత్పత్తి జరిగే ఏప్రిల్‌, మే, జూన్‌లో రెండు నెలల పాటు వేటను నిషేధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతో మాత్రమే వేట సాగించాలి. మర, ఇంజిన్‌ బోట్లను వినియోగిస్తే నేరం చేసినట్లే. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుంది.


వేట విరామంతో ఇప్పటికే 90 శాతం బోట్లు తీరానికి చేరుకోగా. మిగిలిన 10 శాతం ఆదివారం సాయంత్రానికి చేరుకుంటాయని మత్స్యకారులు వెల్లడించారు. వేట విరామం వల్ల సముద్రంలో మత్స్య సంతతి వృద్ధి, సంతాన ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఈ విరామాన్ని అమలు చేస్తోంది. సముద్రంలో చేపల వేట సాగించే మరబోట్లు, వెసల్స్‌, ట్రాలర్ల వల్ల మత్స్య సంపదకు హాని కలుగుతుందని భావించి వీటిని నిషేధించారు. నిషేధ సమయంలో తెప్పలు/ పడవలు సముద్ర తీరం నుంచి 8ది కిలోమీటర్ల లోపు చేపల వేటకు అనుమతిస్తారు.


ఇంజిన్‌ పడవలతో వేట సాగించే మత్స్యకారులు ఈ రెండు నెలల పాటు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మత్స్యకారుల గణనపై సందేహాలు ఉన్నాయి. గతేడాది సుమారు 11వేల మంది మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. వేట విరామ సమయంలో ప్రభుత్వం రూ. 10 వేల పరిహారం అందజేస్తుంది. రెండు నెలలపాటు ఇంజిన్‌, మర పడవలతో వేట చేయడం నిషేధమని,. దీన్ని అతిక్రమిస్తే చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. నాటు పడవలతో ఏ ఆంక్షలు ఉండవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ వల్ల మత్స్యకారుల గణనపై ఇంతవరకు ఏ ఆదేశాలు రాలేదన్నారు నిషేధం పక్కాగా అమలు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.


విరామ సమయంలో ఇంజిన్, మర బోటు యజమానులు వాటికి మరమ్మతులు చేయించుకుంటారు. ఇంజిన్‌ గేర్‌ బాక్సులు, ఆయిల్‌, వాటర్‌, క్యాబిన్‌, ఫ్యాన్లు, బుష్లు వంటి వాటికి రిపేర్లు చేయించని పెట్టుకుంటారు. అలాగే వలలకు కూడా మరమ్మతు పనులు చేపడతారు. బోట్లలో వేట కెళ్లే మత్స్యకార సిబ్బంది (క్రూ) స్థానికంగా లభించే పనులకు వెళ్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com