ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్సీబీ జట్టుపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 11, 2024, 11:17 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.  అయితే 197 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 15.3 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ 69, రోహిత్ శర్మ 38, సూర్యకుమార్ యాదవ్ 52, హార్దిక్ పాండ్యా 21, తిలక్ వర్మ 16 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com