ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయబావుటాను ఎగురవేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారం, ఎన్నికల సమయంలో సమన్వయమే లక్ష్యంగా రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల సమన్వయకర్తల నియమించారు. అమలాపురం నియోజకవర్గానికి కొత్తపల్లి సుబ్బారాయుడు, విజయవాడ ఎంపీ నియోజకవర్గానికి అమ్మిశెట్టి వాసు పేర్లను ఆయన ప్రకటించారు. వీరిద్దరూ మిత్ర పక్ష పార్టీల విజయం కోసం పర్యటనలు, ప్రచారం చేస్తారని వెల్లడించారు.