ఏపీలో పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని.. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ చేతగాని తనంతోనే పోలీసులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్ ఇవ్వడంలేదని.. టీఏ, డీఏలు ఇవ్వడంలేదని మండిపడ్డారు. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకరావు చావుకు జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల అసోసియేట్ ప్రెసిడెంట్ జనకం శ్రీనివాసరావు చేతులెత్తేశారన్నారు. డీజీపీకి సిబ్బంది గురించి పట్టదని.. జగన్ సేవలో తరించడమే తెలుసని విమర్శించారు. ఉదాది, రంజాన్ పండుగలు చేసుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. పదేండ్లుగా పోలీస్ వ్యవస్థలో అప్డేట్ లేదన్నారు. హౌసింగ్కు ఇచ్చే లోన్లను ఐపీఎస్ అధికారులే కొట్టేశారన్నారు. శంకరావు కుంటుబానికి టీటీడీ సానుభూతి తెలియజేస్తుందన్నారు.