ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను పార్టీ పెట్టి యువతకు మంచి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 08:46 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాగళం సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు..బాపు లాంటి గొప్ప చిత్రకారుడు కూడా తణుకులో పుట్టాడని వెల్లడించారు. ఇక్కడే నన్నయ యజ్ఞయాగాదులు చేసి భారతదేశాన్ని ప్రయోగించిన నేల ఇది అని తెలిపారు. ఇస్రో రాకెట్లకు ఇంధనం అందిస్తున్న నేల ఇది... ఎంతో పురోభివృద్ధి ఉన్న నేల ఇది... అలాంటి నేల వైసీపీ పాలనలో కరప్షన్ క్యాపిటల్ గా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘పదేళ్లుగా నేను పార్టీ పెట్టి యువతకు మంచి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా.. మరోవైపు 2047 నాటికి దేశ భవిష్యత్తు ఇలాగే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. చంద్రబాబు బలమైన నాయకుడు, వ్యక్తిత్వం ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం, 90వ దశకం చివరిలో విజన్ 2020 పేరుతో సైబరాబాద్ అనే ఐటీ నగరాన్ని రూపొందించారు. నేడు తెలంగాణ అభివృద్ధికి కేంద్రంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com